అర్జీలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:37 AM
: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ ఆదేశించారు.
అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ
కర్నూలు న్యూసిటీ, జూన 23(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. అడిషనల్ కమి షనర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 29 అర్జీలు వచ్చాయి. ఆర్జీవీ కృష్ణ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లాగి నలో వచ్చిన అర్జీలను అలసత్వం వహించ కుండా పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్రెడ్డి, మేనేజర్ చిన్న రాముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఇనచార్జి ఎస్ఈ శేషసాయి, ఆర్ఓ జునైద్, టిడ్కో అధి కారి పెంచలయ్య, శానిటేషన సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు.