Share News

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:58 AM

104 ఉ ద్యోగుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ఆసంఘం రాష్ట్ర గౌరవ అ ధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
మాట్లాడుతున్న నాగేశ్వరరావు

కర్నూలు న్యూసిటీ/ హాస్పిటల్‌, జూన 15(ఆంధ్రజ్యోతి): 104 ఉ ద్యోగుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ఆసంఘం రాష్ట్ర గౌరవ అ ధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం సీఐటీయూ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో 104సర్వీస్‌ను గతంలో అరబిందో యాజమాన్యం నిర్వహిస్తుం దన్నారు. ఈసంస్థ రెండు నెలల వేతనాలు చెల్లించకుండా కార్మికు లను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న భవ్య హెల్త్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కూడా ప్రతి నెల అన్ని జిల్లాలో 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. మరమ్మతులకు నోచుకోని వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఈ సమా వేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేష్‌, కళ్యాణి, జోజప్ప పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:58 AM