వేరుశనగ ధర రూ.6,287
ABN , Publish Date - May 26 , 2025 | 11:30 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వేరుశనగ ధర సోమవారం క్వింటా గరిష్ఠంగా రూ.6,287కు వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఆదోని అగ్రికల్చర్, మే 26(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వేరుశనగ ధర సోమవారం క్వింటా గరిష్ఠంగా రూ.6,287కు వ్యాపారులు కొనుగోలు చేశారు. గత వారంతో పోల్చితే వేరుశనగ ధర క్వింటాకు రూ.500 పతనమైంది. ఖరీఫ్ సీజన్ ఆరంభపు వేళలో జరగడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని మార్కెట్యార్డుకు 122 వేరుశనగ బస్తాలు విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ.5,689, గరిష్ఠ ధర రూ.6,287, సగటున రూ.6,232 పలికింది.