పేదల పెన్నిధి ఎన్టీఆర్
ABN , Publish Date - May 29 , 2025 | 12:53 AM
పేదల పెన్నిధి న్టీఆర్ అని టీడీపీ జిల్లా కార్యదర్శి భూపాల్ చౌదరి, యువ నాయకులు సిద్దార్థ నాయుడు, రంగస్వామి నాయుడు అన్నారు. పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జయంతి
ఆదోని, మే 28(ఆంధ్రజ్యోతి): పేదల పెన్నిధి న్టీఆర్ అని టీడీపీ జిల్లా కార్యదర్శి భూపాల్ చౌదరి, యువ నాయకులు సిద్దార్థ నాయుడు, రంగస్వామి నాయుడు అన్నారు. పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. వెంకన్న పేట కురువ మల్లికార్జున, రామస్వామి, రంగన్న, కౌన్సిలర్ పార్వతి, బాలస్వామి, శివ పాల్గొన్నారు.
ఆలూరు: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని టీడీపీ నాయకుడు గిరిమల్లేష్ గౌడ్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో 102వ జయంతి నిర్వహించారు. నరసప్ప, కొమ్ము రామాంజనేయులు, మసాల జగన్, గుండన్న, నెట్టెప్ప, అట్టేకల్ గోపాల్, రామయ్య, గోవింద్, ఆంజనేయ, గోవింద్ పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ గోవింద్సింగ్, డీటీ విజయ్కుమార్, ఆర్ఐ బసవన్నగౌడ్, వీఆర్వోలు రవి, రామాంజనేయలు మహేంద్ర, నివాళి అర్పించారు.
పత్తికొండ: దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేదలపెన్నిధి అని టీడీపీ జిల్లాఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్రసభ్యుడు సురేష్కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పత్తికొండ బుధవారం మార్కెట్ యార్డ్వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వఆసుపత్రిలో రోగులకు పండ్లు , బ్రెడ్డు పంపిణీ చేశారు. శారదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, తిరుపాల్, రామానాయుడు, సోమ్లానాయక్, బీటీగోవిందు, చక్కాగోపాల్, దస్తగిరి రెడ్డి, సింగం శ్రీనివాసులు, మీరాహుసేన్, ఉచ్చీరప్ప పాల్గొన్నారు.
తుగ్గలి: ఎన్టీఆర్ సేవలు మరువలేనివని సర్పంచ్ విజయలక్ష్మి, మధు బాబు అన్నారు. బుధవారం అమీనాబాదులో జయంతి నిర్వహిం చారు. వేమన్న చౌదరి, సతీష్ చౌదరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మద్దికెర: మాజీ జడ్పీటీసీ సభ్యుడు జమేదార్ రాజన్న యాదవ్, తెలుగు యువత ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ పాల్గొన్నారు.