Share News

ఇక ఉన్నత పాఠశాలగా..

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:57 PM

మండలంలోని హంప ప్రభుత్వ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటిదాకా 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వరకు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఇక ఉన్నత పాఠశాలగా..
ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాల

హంప గ్రామం ఎంపీపీ పాఠశాలను జడ్పీ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం

మద్దికెర, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హంప ప్రభుత్వ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటిదాకా 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వరకు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు 3వేల మంది ఉన్నారు నివసిస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేసి, 1 నుంచి 8వ తరగతి వరకు ఏర్పాటు చేసింది. పాఠశాలలో 153 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది పాఠశాలను జిల్లా పరిషత్‌ పాఠశాలగా మార్పు చేశారు. ఉపాధ్యాయులను పదోన్నతి ద్వారా భర్తీ చేయనున్నారు. దీంతో సమీపంలోని గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరే అవకాశముంది. హంప గ్రామంతో, సమీప గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:57 PM