రెయిలింగ్ లేని వంతెన
ABN , Publish Date - May 28 , 2025 | 12:16 AM
ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలోని బెంగుళూరు- మంత్రాలయం రహదారిలో లింగాల వాగు వంతెన రెయిలింగ్ దెబ్బతింది.
తుగ్గలి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలోని బెంగుళూరు- మంత్రాలయం రహదారిలో లింగాల వాగు వంతెన రెయిలింగ్ దెబ్బతింది. ఈ దారిలో నిత్యం భారీ వాహనాలు, కార్లు వందల సంఖ్యలో వెళుతుంటాయి. రెయిలింగ్ లేకపోవడంతో వాహనదారులు భయపడుతూనే వెళుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా వాహనాలో లోయలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్అండ్బీ అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.