ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:31 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బనగానపల్లె, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ప్రతి ఏటా జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కళాశా లలో అధ్యాపకులు, విద్యార్థులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ లలిత, అధ్యాపకుడు బడేసాహెబ్లు మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం తొలి విద్యాశాఖామంత్రిగా సేవలందించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, అధ్యాపకుడు బడేసాహెబ్, విద్యార్థులు పాల్గొన్నారు.