Share News

మంత్రాలయంలో మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - May 08 , 2025 | 12:19 AM

రాఘవేంద్ర సర్కిల్‌లో బుధవారం సాయంత్రం రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ యంత్రా లతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

మంత్రాలయంలో మాక్‌ డ్రిల్‌
మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు

మంత్రాలయం, మే 7(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర సర్కిల్‌లో బుధవారం సాయంత్రం రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ యంత్రా లతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. యుద్ధం జరిగితే ఎలా ఉండాలనే దానిపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మాక్‌ డ్రిల్‌లో సైరన్లు మోగినప్పుడు, ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలు, గ్యాస్‌ ఆపివేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. సైరన మోగి నప్పుడు ఆందోళనకు గురి కావద్దని, ఆల్‌ క్లియర్‌ అన్నప్పుడు మాత్రమే బయటకు రావాలన్నారు. ఈమాక్‌ డ్రిల్‌లో తహసీల్దార్‌ రవి, ఆర్‌ఐ ఆదాం, సీఐ రామాంజులు, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయకుమార్‌, శివాంజల్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ లక్ష్మినా రాయణ, సర్వే యర్‌ హరి, వీఆర్వో భీముడు, భీమన్నగౌడు, ప్రభాకర్‌, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:19 AM