మట్కా బీటర్ల అరెస్టు
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:15 AM
పట్టణంలో ఏడుగురు మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ డీవై స్వామి తెలిపారు.
రూ.2.30లక్షల నగదు స్వాధీనం
కోడుమూరు, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఏడుగురు మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ డీవై స్వామి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలో కోడుమూరుకు చెందిన వీరరాజ నాయుడు, లింగ బలిజ విజయ్ కుమార్, దివాకర్, లింగ బలిజ గీత, కాశి అలాగే కోడుమూరు మండలం కల్లపరి గ్రామానికి చెందిన నాగేష్, దేవనకొండ మండలం బేతపల్లి గ్రామానికి చెందిన రెడ్డిరాజు మాట్కా రాస్తున్నట్లు సమాచారం అందడంలో దాడులు చేసి బీటర్లను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వీరి దగ్గర నుంచి రూ.2.30లక్షల నగదు, 7 మాట్కా చీటీలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్నాయక్, హెడ్కానిస్టేబుల్ మద్దేశ్వర్ పాల్గొన్నారు.