Share News

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:40 PM

దేశ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి కోరారు.

 లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

కర్నూలు లీగల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి కోరారు. స్థానిక జిల్లా కోర్టు హాలులో పీపీలు, ఏపీపీలు, జీపీలు బీమా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో మోటారు వాహనాల ప్రమాదాల కేసులు, సివిల్‌ కేసులు, భూసేకరణ కేసులు, బ్యాంకు, చిట్‌ఫండ్‌ వివాదాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. రాజీకి వీలున్న క్రిమినల్‌ కేసులే గాక ప్రిలిటిగేషన్‌ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి పలు బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాసులు, కర్నూలు డిపో మేనేజర్‌ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:40 PM