Share News

సత్వర న్యాయానికి లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:14 AM

కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతోనే లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు.

సత్వర న్యాయానికి లోక్‌ అదాలత్‌
ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది

జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది

కర్నూలు లీగల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతోనే లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు. శనివారం స్థానిక లోక్‌ అదాలత్‌ భవనంలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు కొన్నేళ్లుగా పరిష్కారం కాని భూసేకరణ కేసులలో నష్టపరిహారం చెల్లించడానికి ఈ రోజు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భూములు కోల్పోయిన వారు నష్టపరిహారం సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాదరని, వారికి చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో 16 బెంచ్‌లను వివిధ న్యాయాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయాధికారులు కమలాదేవి, వాసు, శ్రీవిద్య, అదనపు సబ్‌ జడ్జీ దివాకర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి సరోజనమ్మ, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లుతో పాటు పెద్ద సంఖ్యలో కక్షిదారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:14 AM