నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలి
ABN , Publish Date - May 07 , 2025 | 12:33 AM
జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
కరెంటు, రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంకావాలి
నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కల్లూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళ వారం కర్నూలులోని తన స్వగృహంలో ఆయన వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కాటసాని మాట్లా డుతూ కరెంటుచార్జీల పెంపు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలాంటి పోరా టాలకైనా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి నందికొట్కూరు ఇన్చార్జి దారా సుధీర్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.