అన్న క్యాంటీన్లో జేసీ
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:58 PM
అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యతగా ఉండేలా తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యతగా ఉండేలా తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఉన్న అన్న క్యాంటీన్ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భోజనం ఎలా ఉందంటూ అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఫిర్యాదులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జేసీ సిబ్బందిని ఆదేశించారు.