అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:21 AM
సీఎం చంద్రబాబు నాయు డు నుంచి అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని డా.ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం శివప్రసాద్ అన్నారు.
అబ్దుల్ కలాం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం శివప్రసాద్
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయు డు నుంచి అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని డా.ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం శివప్రసాద్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన రాష్ట్ర ఉత్తమ పాఠశాల అవార్డును అందుకున్నారు.