లాడ్జీల్లో తనిఖీలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:56 PM
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు.
నంద్యాల టౌన్ జూన్28(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు లాడ్జీల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో క్షుణ్ణంగా పరిశీలించి వ్యక్తుల వివరాలు తెలుసు కున్నా మని, అనుమాని తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొబైల్ సిస్టం ద్వారా ఎంక్వరీ చేసి వారి వివరాలను ఆరా తీశామన్నారు.