పెరిగిన పత్తి ధర
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:46 AM
: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు సోమవారం పెరిగాయి. నెల రోజుల తర్వాత పత్తి ధరల్లో కదలిక రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్వింటా గరిష్ఠంగా రూ.7629
ఆదోని అగ్రికల్చర్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు సోమవారం పెరిగాయి. నెల రోజుల తర్వాత పత్తి ధరల్లో కదలిక రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ.7629 పలికింది. క్వింటానికి రూ.200పైగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో దూది ధర పెరగడం వల్ల స్థానిక మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు.