శ్రీశైలంలో హుండీల లెక్కింపు
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:53 PM
శ్రీశైల దేవస్ధానంలోని హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యం లో లెక్కించారు.
దేవస్థానానికి రూ.4.17 కోట్ల ఆదాయం
ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, జూలై 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్ధానంలోని హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యం లో లెక్కించారు. 27 రోజులకు గాను హుండీలను లెక్కించగా రూ.4,17,61,215 నగదు, 225గ్రాముల 600మిల్లీ గ్రాముల బంగారు, 11కేజీల 500గ్రాముల వెండి లభించినట్లు ఈవో తెలిపారు. 475 యుఎస్ఏ డాలర్లు, 70 యుఏఇ దిర్హమ్స్, 1300 ఓమన్ బైసా, 155 కెనడా డాలర్లు, 305 ఆస్ట్రేలియా డాలర్లు, 40 ఇంగ్లాండు పౌండ్స్, 2సింగపూర్ డాలర్లు, 50న్యూజిలాండ్ డాలర్లు, 5స్కాట్లాండ్ పౌండ్స్, 30 ఈరోస్, 1సౌదీరియాల్స్, 51కత్తార్ రియాల్స్, 1మలేషియా రింగిట్స్, 200 ఇధోపియాన్ బిర్, 220 శ్రీలంక కరెన్సీ రూపాయలు, 160 నేపాల్ రూపాయలు మెదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అన్ని యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.