భారీగా పత్తి దిగుబడులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:13 PM
ఆదోని వ్యవ సాయ మార్కెట్ యార్డ్ తెల్ల బంగారంతో కళకళలాడింది.
ఆదోని అగ్రికల్చర్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవ సాయ మార్కెట్ యార్డ్ తెల్ల బంగారంతో కళకళలాడింది. రైతులు గురువారం పత్తి దిగుబడులను భారీగా మార్కెట్ యార్డుకి తీసుకొ చ్చారు. 13,210 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చిన పత్తి దిగుబడులతో ఎటువైపు చూసిన ప్లాట్ఫారాలన్నీ పత్తితో కనిపిం చాయి. ధర స్వల్పంగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 13,210 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3,960, మధ్యస్తంగా రూ.7,399, గరిష్ఠంగా రూ.7,669 చొప్పున పలికింది.