శ్రీశైలానికి భారీ వరద
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:51 PM
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం జలాశయం క్రస్ట్గేట్ల ఎత్తు 18 అడుగులకు పెంచారు.
10 గేట్లతో నీటి విడుదల
శ్రీశైలం,సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం జలాశయం క్రస్ట్గేట్ల ఎత్తు 18 అడుగులకు పెంచారు. 10 గేట్ల స్పిల్వే నుంచి 4,26,160 క్యూసెక్యుల వరద నీటిని సాగర్కు సాగనంపతున్నారు. డ్యాం నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 882 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్థ్యం 203 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 65,164 క్యూసెక్యులు విడుదల చేశారు.