రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:32 AM
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్నదాతలకు సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేసి సద్వినియోగంచేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచించారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్నదాతలకు సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేసి సద్వినియోగంచేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచించారు. ఆదివారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులో నంద్యాల, గోస్పాడు మండలాల రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను మార్కెట్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మారుతున్న వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా రైతులకు నూతన వ్యవసాయ యంత్రాలు అవసరమని ప్రభుత్వం గ్రహించి వాటిని సబ్సిడీపై అందిస్తుందన్నారు. కొన్నిసబ్సిడీ యంత్రాలు బయట మార్కెట్లోనే తక్కువ ధరకు వస్తున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా మన్నారు. అలాగే జీఎస్టీ గురించి వ్యవసా యశాఖ మంత్రితో చర్చిస్తామన్నారు. డీసీ చైర్మన్ ఇలి యాస్, జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఎంపీపీ ప్రభాకర్, టీడీపీ నాయకులు విశ్వ నాధరెడ్డి, తులసీశ్వరరెడ్డి, మండల వ్యవసాయాధికారులు ప్రసాదరావు, స్వప్నిక పాల్గొన్నారు.