Share News

రైతులను విస్మరించిన ప్రభుత్వం

ABN , Publish Date - May 21 , 2025 | 12:01 AM

టీడీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని, బీమా పరిహారం ఇవ్వడంలో విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు

రైతులను విస్మరించిన ప్రభుత్వం
కామినహాల్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

అందని బీమా పరిహారం : ఎమ్మెల్యే విరుపాక్షి

హాలహర్వి, మే20(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని, బీమా పరిహారం ఇవ్వడంలో విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. మంగళవారం కామినహాల్‌ గ్రామంలో మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుకు ఏడాది పూర్తవుతున్నా సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. 2023, 2024 ఖరీఫ్‌ పంటల బీమా రైతుల ఖాతాల్లో జమ కాలేదని, రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. పెట్టుబడి సాయం అందిం చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వర్షాలు కురుస్తున్నాయని సకాలంలో విత్తనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ పద్మ, వైసీపీ కార్యదర్శి జనార్ధన్‌నాయుడు, అర్ధగేరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:01 AM