సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆరోపించారు.
ఆలూరు మ్మెల్యే విరుపాక్షి
దేవనకొండ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక మూగితాత పంక్షన్హల్లో బాబు ష్యూరీటీ మోసం గ్యారంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.2.70లక్షల కోట్లు పంపీణి చేసిందని, అయితే టీడీపీ సర్కారు సర్దుబాటు పేరుతో రూ.15 వేల కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు చేసింద న్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి పింఛన్ తొలగించారని, మంది తల్లులకి ‘తల్లికి వందనం’ పథకం అమలు కాలేదని మండిపడ్డారు. జడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ, రాజారెడ్డి, సిద్దం హంపిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రేమ్నాథ్రెడ్డి, దివాకర్నా యుడు, నారాయణరెడ్డి, నామాల శ్రీను, కభీర్, బాబు, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.