Share News

బీర.. కరువు తీర

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:27 PM

మండలంలోని తెర్నేకల్‌కు చెందిన ఉప్పర సొట్ట రాముడు తనకు 1.5 ఎకరాలు ఉండగా, 80 సెంట్లలో బీర సాగు చేశాడు.

బీర.. కరువు తీర
బీర పంటను చూపుతున్న రైతు ఉప్పర సొట్ట రాముడు

రూ.50వేల పెట్టుబడితో రూ.1.5లక్షల ఆదాయం

దేవనకొండ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తెర్నేకల్‌కు చెందిన ఉప్పర సొట్ట రాముడు తనకు 1.5 ఎకరాలు ఉండగా, 80 సెంట్లలో బీర సాగు చేశాడు. గతే ఏడాది రూ.50 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేయగా 1.5 లక్షల ఆదాయం వచ్చింది. అనంతరం ఈ ఏడాది కూడా బీర సాగు చేయగా కోతలు కోశారు. తాను 600 కర్రలను ఒక్కొక్కటి రూ.70ల ప్రకారం కొనుగుచేశానని, కర్రకు రెండగుడుగుల ఎడం పాటించానన్నాడు. ఇలా కర్రలు పాతి సాగుచేస్తే కాయకు మచ్చల ప్రభావం ఉండదన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:27 PM