జీవో 77ను రద్దు చేయాలి: పీడీఎస్యూ
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:51 AM
పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 7(ఆంధ్రజ్యోతి): పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర సన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఫీజు రీయింబ ర్స్మెంటు బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ వసతి గృహల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా తల్లికి వం దనం పథ కాన్ని విద్యార్థులందరికీ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు నరేష్, అస్లాం బాషా, కిరణ్, దినేష్ పాల్గొన్నారు.