అవయవదానానికి ముందుకు రావాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:18 AM
అవయవదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కిమ్స్ హాస్పిటల్స్ సీఈవో డా.సునీల్ సేపూరి పిలుపునిచ్చారు.
కర్నూలు హాస్పిటల్/న్యూసిటీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అవయవదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కిమ్స్ హాస్పిటల్స్ సీఈవో డా.సునీల్ సేపూరి పిలుపునిచ్చారు. భగత్సింగ్ 118వ జయంతి సందర్బంగా నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్, కిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవయవదానం నమోదుకు విశేష స్పందన వచ్చిందని, అవయవదానంతో మరణించిన తర్వాత ఇతరులను బతికించే అవకాశం ఉంటుందన్నారు. కిడ్నీ, కాలేయ మార్పిడి 96 శాతం సక్సెస్ రేటుతో ఇక్కడే చేస్తున్నామన్నారు. అనంతరం దాదాపు 150 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్యల్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదరిశ ఎస్.మునెప్ప, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.