Share News

జూలై 1 నుంచి ఉచిత స్పర్శ దర్శనం

ABN , Publish Date - Jun 24 , 2025 | 10:59 PM

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జూలై ఒకటో తేదీ నుంచి వారంలో నాలుగురోజుల పాటు స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

జూలై 1 నుంచి ఉచిత స్పర్శ దర్శనం
పరిశీలిస్తున్న ఆలయ ఈవో

నంద్యాల కల్చరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జూలై ఒకటో తేదీ నుంచి వారంలో నాలుగురోజుల పాటు స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 నిమిషాల వరకు ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పిస్తామన్నారు. భక్తులు ఏ రోజుకారోజు ఉచిత స్పర్శదర్శనం టోకన్లు పొందాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉచితస్పర్శదర్శన క్యూలైన్లు, అన్న ప్రసాద కేంద్రం, తదితర విభాగాలను మంగళవారం పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 10:59 PM