ఇక నుంచి ఉచిత ప్రసాదం
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:47 PM
మహానంది క్షేత్రంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఇక నుంచి ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఏఈవో ఎర్ర మల్ల మధు గురువారం తెలిపారు.
మహానంది దేవస్థానం ఏఈవో ఎర్రమల మధు
మహానంది, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఇక నుంచి ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఏఈవో ఎర్ర మల్ల మధు గురువారం తెలిపారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు మహానంది ఆలయంలో ఉచిత ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి, ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.