మంత్రాలయంలో ఫుడ్ కమిషన చైర్మన
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:51 AM
ఏపీ ఫుడ్ కమిషన చైర్మన విజయ ప్రతాప్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రాలయం వచ్చారు.

మంత్రాలయం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫుడ్ కమిషన చైర్మన విజయ ప్రతాప్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రాలయం వచ్చారు. వీఐపీ సుజీంధ్ర ఏసీ గెస్టు హౌస్ వద్ద మంత్రాలయం తహ సీల్దార్ ఎస్.రవి, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు మహేష్, వలి బాషా, ఎంఈవో రాగన్న, వీఆర్వో భీమన్నగౌడు, సర్వేయర్ హరి పుష్ప గుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆయన మంత్రాలయంలోనే బస చేసి బుధవారం రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మంత్రాల యం, పెద్దకడుబూరు మండలాల్లో పర్యటించనున్నారు. ఆయన రాకతో అన్ని పాఠశాలల హెచఎంలు, రేషనషాపు డీలర్లు అప్రమత్తమయ్యారు.