Share News

శ్రీశైలానికి తగ్గిన వరద

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:15 AM

శ్రీశైలం డ్యాంకు వరద తగ్గింది. గురువారం గేట్లు తెరిచిన అధికారులు శుక్రవారం వాటిని మూసివేశారు.

శ్రీశైలానికి తగ్గిన వరద

డ్యాం గేట్లు మూసివేత

నీటి నిల్వ సామర్థ్యం 208 టీఎంసీలు

శ్రీశైలం, సెప్టెంబరు 5 (ఆంద్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు వరద తగ్గింది. గురువారం గేట్లు తెరిచిన అధికారులు శుక్రవారం వాటిని మూసివేశారు. గడిచిన 24 గంటల్లో రెండు విద్యుత్‌ కేంద్రాల్లో 32.379 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి గావించి జెన్‌కో అధికారులు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఎగువ పరివాక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 1,15,383 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం శుక్రవారం సాయ్రంతం 6గంటల సమయానికి 883 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్థ్యం 208 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 66,327 క్యూసెక్కులు విడుదల చేయడం జరుగుతుంది.

Updated Date - Sep 06 , 2025 | 12:15 AM