త్వరగా పరిష్కరించండి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:46 PM
ప్రజల సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశించారు.
పజా సమస్యలపై అధికారులకు మంత్రి బీసీ ఆదేశం
క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ
బనగానపల్లె, ?నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం బన గానపల్లె పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల, వివిధ వర్గాలకు చెందిన అర్జీలను మంత్రి బీసీ స్వీకరించారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను అప్పటికప్పుడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కు వగా రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.