Share News

‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:37 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీ ఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు.

‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

కోవెలకుంట్ల, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీ ఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నాయకుడు ఎం. సుధాకర్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతోందని, వీబీజీ రామ్‌ జీ పేరుతో పథకాన్ని పేరు మార్చడం పూర్తి అన్యాయమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములమ్మ, జోసఫ్‌, సుబ్బారెడ్డి, మహేష్‌, రామసుబ్బయ్య, కృష్ణారెడ్డి, రాముడు, దిబ్బరాజు, మురళి, కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:37 AM