Share News

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:54 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రస్వామికి ఇష్టమైన గురువారం శుభదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
మఠం ప్రాంగణంలో రద్దీగా ఉన్న భక్తులు

ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు

మంత్రాలయం, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రస్వామికి ఇష్టమైన గురువారం శుభదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదితీరంలో భక్తుల సందడి నెలకొంది. తుంగభద్ర నదీతీరంలో షవర్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు, సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్‌, పోలీసులు, సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రసాదాల కొరత రాకుండా ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 17 , 2025 | 11:54 PM