మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:04 AM
మంత్రాల యానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు
మంత్రాలయం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మంత్రాల యానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మఠం అతిఽథిగృహలు, ప్రైవేట్ లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్ కారిడార్ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రోడ్లు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరంలో కోలాహలం నెలకొంది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైన్న్లు, పరిమళప్రసాదం వద్ద భక్తులతో సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.