ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:46 AM
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు భరోసా కలిగిందని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
ఎమ్మెల్సీ బీటీ నాయుడు
కర్నూలు అర్బన, జూలై 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు భరోసా కలిగిందని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. మంగళవారం నగరంలోని బీ.క్యాంప్ లోని పలు కాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జిలా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.