Share News

డిమాండ్లను పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:47 PM

నగరపాలక సంస్థ పరిధిలోని ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

డిమాండ్లను పరిష్కరించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులు

ఇంజనీరింగ్‌ కార్మికుల నిరసన

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ నగర పాలక కార్యాలయం నుంచి చిన్నపార్కు, రాజ్‌విహార్‌ సర్కిల్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.24.500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సమీర్‌ బాషా, ఉపాధ్యక్షుడు నాగశేషులు, నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నా యకులు యాసిన్‌బేగ్‌, గంగమ్మ, ఇంజనీరింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:47 PM