శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:58 PM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 12(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండో శనివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించారు.