Share News

మంత్రాలయంలో భక్తుల సందడి

ABN , Publish Date - May 01 , 2025 | 12:34 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది.

మంత్రాలయంలో భక్తుల సందడి
మఠం ప్రాంగణంలో రద్దీగా ఉన్న భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. బుధవారం అక్షయ తృతీయ కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మద్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వ హించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు.

Updated Date - May 01 , 2025 | 12:34 AM