మంత్రాలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:10 PM
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన వేలాది మంది భక్తులతో శనివారం మంత్రాలయం కిక్కిరిసింది.
మంత్రాలయం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన వేలాది మంది భక్తులతో శనివారం మంత్రాలయం కిక్కిరిసింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీమఠం ప్రాంగణం భక్తులతో మార్మోగింది. శ్రీమఠం అతిథి గృహాలు, ప్రైవేటు అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి.