Share News

మంత్రాలయంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:04 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది.

మంత్రాలయంలో భక్తుల రద్దీ
భక్తులతో కిక్కిరిసిన మఠం ప్రాంగణం

మంత్రాలయం, మే 31(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. శనివారం జ్యేష్ఠమాసం పంచమి కావటంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మఠం అతిఽథి గృహాలు, ప్రైవేట్‌ లాడ్జిలు భక్తులతో నిండి పోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్‌ కారిడార్‌ ముందే భక్తు లు బసచేశారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం ఏఏఓ మాధవ శెట్టి, మేనేజరు వెంకటేష్‌ జోషిలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరువైపులా పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యతో భక్తులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Jun 01 , 2025 | 01:04 AM