శాంతి భద్రతల కోసమే కార్డెన్ సెర్చ్
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:56 PM
ప్రజల రక్షణ, శాంతి భద్రతల కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఆరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణ, శాంతి భద్రతల కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఆరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమానాస్పద, నేర చరిత్ర కల్గిన వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించామన్నారు. అలాంటి వారికి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సరియైున పత్రాలు లేని 15 వాహనాలను, అక్రమంగా విక్రయిస్తున్న 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైం, రోడ్డు ప్రమాదాలు, చిన్నారులపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
జిల్లాలో నేర చరిత్ర ఉన్నవారు మంచి పౌరులుగా మారాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్టబద్ధంగా జీవించాలని సూచించారు.