కొనసాగుతున్న నీటి విడుదల
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:20 PM
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్కు ఎగువ జూరాల స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీ 2,66,212 క్యూసెక్యులు ఇన్ప్లోగా వచ్చి చేరాయి.
శ్రీశైలం నీటి మట్టం 881 అడుగులు
శ్రీశైలం,సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్కు ఎగువ జూరాల స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీ 2,66,212 క్యూసెక్యులు ఇన్ప్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం 10 క్రస్ట్గేట్ల గుండా 2,66,060 క్యూసెక్యులు సాగర్కు సాగనంపుతున్నారు. శ్రీశైలం రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 65,341 క్యూసెక్యులు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 881 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్థ్యం 197 టీఎంసీలుగా నమోదైంది.