ఈవీఎంలపై నిరంతర నిఘా
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:54 PM
ఈవీఎంలను భద్రప రిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్ట మైన నిఘా ఉండాలని కలెక్టర్ పి.రంజి త్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఈవీఎంలను భద్రప రిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్ట మైన నిఘా ఉండాలని కలెక్టర్ పి.రంజి త్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదే శాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యం త్రాలు, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఎన్నికల విభా గం సూపరింటెండెంట్ మురళి, రాజకీ య పార్టీల ప్రతినిధుల బీజేపీ సాయి ప్రదీప్, జనసేన మంజునాథ్, బహుజన సమాజ్వాదీ పార్టీ డిస్ర్టిక్ ఇన్చార్జి అరుణ్ కుమార్; టీడీపీ తెలుగు యువత వైస్ ప్రెసిడెంటు పి.రాజు, కాంగ్రెస్ బజారన్న పాల్గొన్నారు.