‘ఆపరేషన్ సిందూర్’తో ధైర్యం
ABN , Publish Date - May 17 , 2025 | 11:51 PM
ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశ ప్రజల్లో ధైర్యం వచ్చిందని ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆలూరులో కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఆలూరు, మే 17(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశ ప్రజల్లో ధైర్యం వచ్చిందని ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆలూరులో కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వీరభద్రగౌడ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవా దులను హతమార్చడంలో భారత సైన్యం విజయం సాధించడంపై జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఇన్చార్జి వెంకట రాముడు, జనసేన నాయకుడు రంజిత్, డీసీ అధ్యక్షుడు కిష్టప్ప, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ రామ్నాథ్యాదవ్, టీడీపీ నాయకుడు గిరిమల్లేష్గౌడ్, కన్వీనర్లు అశోక్, పరమరెడ్డి, బాబు, రఘుప్రసాద్రెడ్డి, నరసప్ప, కొమ్ము రామాంజనేయులు, ముద్దురంగ, దేవేంద్రయాదవ్, సతీష్, గుండన్న పాల్గొన్నారు.