సర్వేను త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - May 10 , 2025 | 12:35 AM
జిల్లాలో ఎనసీడీ-3.0 సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచవో పి.శాంతికళ ఆదేశిం చారు.

డీఎంహెచవో పి.శాంతికళ
కర్నూలు హాస్పిటల్, మే 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎనసీడీ-3.0 సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచవో పి.శాంతికళ ఆదేశిం చారు. శుక్రవారం శ్రీరామ్నగర్లోని అర్బన హెల్త్ సెంటర్ను ఆమె తనిఖీ చేశారు. డీఎంహెచవో శాంతికళ మాట్లాడుతూ అసంక్రమిక వ్యాధుల కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఎనసీడీ-3.0 సర్వే వివ రాలను మొబైల్ యాప్లో అప్లోడు చేయాలని ఆదేశించారు. స్టాఫ్ నర్సులు, ఏఎనఎం, ఆశాలు కలిపి ఇం టింటి సర్వే నిర్వహించాల న్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వేకల్ క్యాన్సర్, బీపీ, మధుమేహంతో పాటు హీమోగ్లోబిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత కేసులను ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్కు పంపిం చాలని ఆదేశించారు. క్యాన్సర్ కేసులను స్టేట్ క్యాన్సర్ ఇనస్టిట్యూట్కు పంపించాలన్నారు. వారంలో రెండు రోజులు మంగళ, గురువారం క్యాన్సర్ రెఫర్ కేసులు చూస్తారన్నారు. కార్యక్ర మంలో జిల్లా మలేరియా అధికారి ఏ.నూకరాజు, డిప్యూటీ డెమో చంద్ర శేఖర్ రెడ్డి, ఏఎనఎం పి.పద్మావతి, ఆశా కార్యకర్త ఎం.పద్మావతి పాల్గొన్నారు.