Share News

దసరా ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:09 PM

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే దసరా మహోత్స వాలకు రావాలని శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చకులు కలెక్టర్‌ రాజకుమారికి ఆహ్వానం పలికారు.

దసరా ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు, వేదపండితులు

నంద్యాల కల్చరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే దసరా మహోత్స వాలకు రావాలని శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చకులు కలెక్టర్‌ రాజకుమారికి ఆహ్వానం పలికారు. శ్రీశైల దేవస్థానం ఏఈవో, ఆలయ అర్చకులు శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం దేవస్థానం వేదపండితులు కలెక్టర్‌ను ఆశీర్వదించారు.

Updated Date - Sep 19 , 2025 | 11:09 PM