సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:29 AM
చికిత్సలు చేయించు కున్న బాధితులకు సీఎం సీఎం సహాయ నిధి వరమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు
ఎమ్మెల్యే పార్థసారథి.. బాధితులకు చెక్కుల పంపిణీ
ఆదోని, జూలై26(ఆంధ్రజ్యోతి): చికిత్సలు చేయించు కున్న బాధితులకు సీఎం సీఎం సహాయ నిధి వరమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి రూ.5,32,485ల చెక్కులను 15 మంది బాధితులకు పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం అధికంగా ఖర్చు చేసిన వారు సీఎం సహాయ నిధి సాయం పొందవచ్చాన్నారు.
ఉచిత ఇసుకను వినియోగించండి
గృహాలు నిర్మించుకునే ప్రజలు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత ఇసుకను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. శనివారం క్యాంపు కార్యాల యంలో మాట్లాడుతూ ట్రాక్టర్లు, టిప్పర్లలో వాగులు వంకల నుంచి వచ్చే ఇసుకతో మోసపోవొద్దన్నారు. ఇసుక రీచ్ల నుంచి నాణ్యమైన ఇసుక రూ.4200లకు ప్రభుత్వం ఇస్తుందన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.