సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:30 PM
బ్యాంకుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బ్యాంకు అధికారులకు సూచించారు.
బ్యాంకు అధికారులతో ఎస్పీ సమీక్ష
నంద్యాల టౌన్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బ్యాంకు అధికారులకు సూచించారు. బ్యాంకుల భద్రత ప్రమాణాలపై శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన, లైసెన్స్ పొందిన గార్డులను నియమించుకోవాలని సూచించారు. అన్ని బ్యాంకుల వద్ద అత్యవసర ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఖాతాదారులు సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్బీ సీఐ మోహన్రెడ్డి , వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.