Share News

ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా బీటీ నాయుడు

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:05 PM

ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో  సభ్యుడిగా బీటీ నాయుడు
బీటీ నాయుడు

ఆదోని, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రొటోకాల్‌ పాటించాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ ఆదోని మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:05 PM