ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బీటీ నాయుడు
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:05 PM
ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదోని, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రొటోకాల్ పాటించాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ ఆదోని మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు.