అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:53 PM
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ ఆదేశించారు.
వీసీలో సీఎస్ విజయానంద్
నంద్యాల ఎడ్యుకేషన్ / నంద్యాల టౌన్, జులై 10 (ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2047, పీ4 ఫౌండేషన్, రిలయన్స్ కంప్రెస్ట్ బయోగ్యాస్ యూనిట్లు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు తదితర అంశాలపై సచివాలయం నుంచి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ రాజకుమారి సీఎస్కు వివరించారు. పీ4 సర్వే జరుగుతోందని, సీజనల్ వ్యాధులపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో రామునాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.