ఒత్తిడికి దూరంగా ఉండాలి : సూపరింటెండెంట్
ABN , Publish Date - May 27 , 2025 | 12:21 AM
ప్రతి ఒక్కరూ ఒత్తిడికి దూరంగా ఉండాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ వెంకటే శ్వర్లు అన్నారు.
కర్నూలు హాస్పిటల్, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఒత్తిడికి దూరంగా ఉండాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ వెంకటే శ్వర్లు అన్నారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కమ్యూనిటీ మెడిసిన విభాగం ఆధ్వర్యంలో వెల్నెస్ క్లీనిక్లో రక్తపోటు అవగాహన మాసోత్సవ కార్యక్రమం జరిగింది. రక్తపో టుపై హౌస్ సర్జన్లుతో రోగులకు హెల్త్ టాక్ కార్యక్రమాన్ని సూపరిం టెండెంట్ ప్రారంభించారు. స్వయంగా సూపరింటెండెంట్ రోగులకు బీపీ పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం హెల్త్ చెకప్, రక్తపో టును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల గుండె, స్ర్టోక్ జబ్బులకు దూ రంగా ఉంచువచ్చన్నారు. అనంతరం హౌస్ సర్జన్లు వివిధ పోస్టర్లు, బొమ్మల ద్వారా రోగులకు బీపీపై అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో కమ్యూనిటీ మెడిసిన హెచవోడీ డా.సుధాకుమారి, ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద, సీఎస్ఆర్ఎంవో బి.వేంక టేశ్వరరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్పీ సావిత్రీబాయి పాల్గొన్నారు.